హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 35 కార్పొరేషన్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది. 34 చైర్మన్, ఒకటి వైస్ చైర్మన్ పదవులకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 15నే ఉత్తర్వులు విడుదల చేయగా.. ప్రభుత్వం సోమవారం బయటికి ఇచ్చింది. దాదాపు 115 రోజులపాటు జీవోను గుట్టుగా దాచి ఉంచడంపై విమర్శలొస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడానికి ఒక్క రోజు ముందు కార్పొరేషన్ పదవుల జాబితాను లీక్ చేశారు. అదే రోజున జీవోలు విడుదలైనా.. ఇన్నాళ్లుగా ఎందుకు బహిర్గతం చేయలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పైగా జూన్ 4తో ఎన్నికల కోడ్ ముగిసింది. ఆ తర్వాత కూడా నెలరోజులకుపైగా గుట్టుగా ఉంచడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రాంరెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎస్ అన్వేష్రెడ్డి, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్గా మెట్టు సాయి కుమార్, ఎఫ్ఐడీసీ చైర్మన్గా చల్లా నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
19