K Keshawa Rao | రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు రాజీనామా అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమయంలో బుధవారం కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మారడంతో రాజీనామా చేశారు. కేశవరావును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు నామినేట్ చేశారు. 2020 సెప్టెంబర్లో కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన గత ఏప్రిల్లో పార్టీ మారిన విషయం తెలిసిందే. నిన్న జాతీయ అధ్యక్షుడి సమక్షంలో పార్టీ చేరి.. తాజాగా రాజ్యసభకు రాజీనామా చేశారు.