Junior Doctors | హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాతో జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.
ప్రతి నెల స్టైఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు ప్రతి నెలా స్టైఫండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు. దీంతో పాటు పెరుగుతున్న మెడిసిన్ సీట్లకు అనుగుణంగా హాస్టళ్ల వసతి సౌకర్యాలు పెంచాలి. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించకపోవడంతో భయంభయంగా వైద్యసేవలు అందించాల్సి వస్తుంది. వెంటనే కొత్త భవనం నిర్మించాలి. అలాగే కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు అధ్వానంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ సమస్యలను పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెకు కాంగ్రెస్ పర్కార్ దిగొచ్చింది. వసతి గృహాల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా మిగతా డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో జూనియర్ వైద్యుల వసతి గృహాల నిర్మాణానికి, కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారుల పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు రూ. 204.85 కోట్లు కేటాయించారు. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ. 121.90 కోట్లు, గాంధీ ఆస్పత్రికి రూ. 79.50 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్లకు రూ. 2.75 కోట్లు కేటాయించారు.
లేడిస్ హాస్టల్ నిర్మాణానికి రూ. 80 కోట్లు
మెన్స్ హాస్టల్ నిర్మాణానికి రూ. 35 కోట్లు
డెంటల్ హాస్టల్ నిర్మాణానికి రూ. 6 కోట్లు
బాయ్స్ హాస్టల్ రినోవేషన్కు రూ. 50 లక్షలు
కృష్ణవేణి లేడిస్ హాస్టల్ ముందు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 40 లక్షలు
లేడిస్ హాస్టల్ నిర్మాణానికి రూ. 42 కోట్లు
మెన్స్ హాస్టల్ నిర్మాణానికి రూ. 23 కోట్లు
సీనియర్ రెసిడెంట్ బ్లాక్ హాస్టల్ నిర్మాణానికి రూ. 14.50 కోట్లు
ఇంటర్నల్ సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణానికి రూ. 2.75 కోట్లు