నవాబుపేట, జూన్ 29: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండ ల కాంగ్రెస్ నాయకుడు కొండల్ అనుచరులతో కలిసి తహసీల్ కార్యాలయం పక్కనే ఆమరణ దీక్ష ప్రారంభించారు. పోలీసులు అక్కడి వచ్చి కాంగ్రెస్ నేతలను తరలించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, 29 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణంలో జరిగిన అక్రమాలపై శనివారం ఏసీబీ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నా రు. వరంగల్లో ఆర్డీవో దత్తు, ఆదిలాబాద్ జిల్లా తోషంలో డిప్యూటీ తహసీల్దార్ నాగోరావు,హైదరాబాద్లో రియల్ఎస్టేట్ వ్యాపా రి లక్ష్మీనారాయణగౌడ్, ఆసిఫాబాద్లో వ్యాపారి శంభూదాస్ను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
రెబ్బెన మండలం రేపల్లెవాడ నుంచి వాంకిడి మండలం గోయగాం వరకు 54 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు రెండు నెలలుగా విచారణ చేపడుతున్నారు. ఆరేండ్ల క్రితం రహదారి నిర్మా ణానికి దాదాపు 320 హెక్టార్ల భూమిని సేకరించారు. భూ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవినీతిపై బాధితులు ఫిర్యాదు చేయ గా, ఏప్రిల్ 24న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆసిఫాబాద్ ఆర్డీవో కార్యాలయం నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. పరిహారం చెల్లింపుల్లో అవినీతికి పాల్పడిన ఏడుగురిని గుర్తించిన అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్కోలో చీఫ్ జనరల్ మేనేజర్ల (సీజీఎం)ను చీఫ్ ఇంజినీర్లుగా మార్చుతూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ఫారూఖ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంజినీరింగ్ సర్వీస్లోని చీఫ్ జనరల్ మేనేజర్లను చీఫ్ ఇంజినీర్లుగా గుర్తించడంలో ఇతర శాఖల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, 6వ స్థానంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ అధికారులు సీజీఎం క్యాడర్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సీజీఎంలను సీఈలుగా మార్చుతున్నట్టు సీఎండీ పేర్కొన్నారు. టాన్స్కో, జెన్లోని కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఇంజినీరింగ్ హెడ్స్, ఫీల్డ్ ఆఫీసుల్లో పనిచేసే జోనల్ హెడ్స్ ఇకపై చీఫ్ ఇంజినీర్లుగా పరిగణింపబడుతారని వెల్లడించారు. విధులు, బాధ్యతలు, ప్రతినిధి బృందంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టంచేశారు.
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ): బిందుసేద్యం కింద డ్రిప్, స్ప్రింక్లర్లను ఇకపై ఆయిల్పామ్తో పాటు కూరగాయలు, పండ్లతోటలకు కూడా అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. 2024-25 సంవత్సరానికి ఉద్యానశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది మొత్తం రూ. 509 కోట్ల ఖర్చుతో 1.70 లక్షల ఎకరాలకు డ్రిప్, స్ప్రింక్లర్లను అందించేలా ప్రణాళికను రూపొందించింది.
ఇందులో లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ కోసం డ్రిప్ను అందించనుండగా 70,625 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, ఇతర వ్యవసాయ పంటలకు కూడా డ్రిప్, స్ప్రింక్లర్ ఏది అవసరమైతే అది అందించనుంది. తొలిదశలో 85,313 ఎకరాలకు బిందుసేద్యం పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులకు ముందుగా అందించాలని నిర్ణయించింది.