MLA Bandla KrishnaMohan Reddy | జోగులాంబ గద్వాల : గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.
గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితా తిరుపతయ్య అభిమాని ప్రసాద్ (25) ఏకంగా సెల్ టవర్ ఎక్కి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుంటే టవర్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్కు నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.