Revanth Reddy | ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో హెచ్సీయూ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. కాబట్టి ఎన్నికలు అయ్యేదాకా రాజకీయ నాయకులు ఎలాంటి ప్రచారంలో పాల్గొనకూడదు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. అయితే, ఈ సమయంలో INDIA అని పేరు రాసి ఉన్న టీషర్ట్ ధరించడంపై బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ క్రిశాంక్ ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇండియన్ ఫుట్బాల్ టీమ్కు రేవంత్ రెడ్డి కనీసం సబ్స్టిట్యూట్ ప్లేయర్ కాదు.. అలాంటప్పుడు ఇండియా అనే పేరు ఉన్న టీషర్ట్ ఎందుకు ధరించారని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూటమి పేరు INDIA కాబట్టే ఇలా ఇండియా అనే పేరున్న టీషర్ట్ను ధరించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ అందర్నీ ఫూల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
Revanth is not even substitute of INDIAN Football Team .
Then why is he wearing INDIA t shirt ❓
Because INDIA is the name of Congress Alliance and Congress CM is campaigning during Silence Period as well as fooling @ECISVEEP pic.twitter.com/l1lCfdrHCp— Krishank (@Krishank_BRS) May 12, 2024