ఖలీల్వాడి, జూన్ 30: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్కు ఇందూరు ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నిజామాబాద్లోని ఆయన ఇంటి నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు నిజామాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. డీఎస్ భౌతికకాయానికి నివాళులర్పించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు డీఎస్ పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన డీఎస్ మర ణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని సీఎం రేవంత్ అన్నారు. విద్యార్థి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించినట్టు తెలిపారు.