Revanth Reddy | హైదరాబాద్ : సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సరళీకృత ఆర్థిక విధానాలతో ఆధునిక భారతదేశానికి బాటలు విస్తరించిన అపర మేధావిగా, భారతీయ భవ్యకీర్తిని పెంచిన తెలంగాణ తేజోమూర్తిగా గౌరవ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారిది చరిత్రలో ప్రత్యేకమైన స్థానమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్… pic.twitter.com/upX45pbmvJ
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2024
“స్థిత ప్రజ్ఞుడు, బహుభాషాకోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పూర్వ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు” ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి.#pvnarsimharao pic.twitter.com/4pUKcO9nk9
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2024