హనుమకొండ, జూన్ 30: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చి వరంగల్ నగర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఆయన పర్యటనతో నగరానికి ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. నగర అభివృద్ధికి రూ.6 వేల కోట్లు కావాలని సీఎంను మంత్రులు, ఎ మ్మెల్యేలు అడిగితే కనీసం ప్రకటన చేయకుండా వెళ్లిపోయారని విమర్శించారు. ఆదివారం హ నుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి చరిత్రాత్మక నగరానికి కేవలం ప్రైవేట్ దవాఖాన ప్రారంభానికి మాత్రమే వచ్చారని, ఆయనకు పెద్దల వైద్యం మీద ఉన్న శ్రద్ధ పేదల వైద్యం మీద లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ వి ద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి.. సర్కారు దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్ది వైద్యం అందించినట్టు గుర్తుచేశారు.
రేవంత్రెడ్డి పర్యటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులే హర్షించడం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి పనితీరుపై విశ్వాసం తగ్గిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. రేవంత్రెడ్డిని 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండగా కేవలం 26 మంది మాత్రమే బలపరుస్తున్నట్టు తెలిపారు. అధికారంపై సీఎంకు పట్టులేదని, క్యాబినెట్పై విశ్వాసం లేదని చెప్పారు.
రేవంత్రెడ్డి వరంగల్, హనుమకొండ పర్యటనతో వరంగల్కు ప్రయోజనం చేకూరకపోగా.. రూ.3 కోట్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి నేరుగా వరంగల్కి వస్తే ఏదో జరుగుతుందని అనుకున్నామని, కానీ.. ఆయన వచ్చింది ప్రైవేట్ దవాఖాన ప్రారంభోత్సవానికని తెలిసిందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు.