హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖకు తానే మంత్రినని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మాట్లాడు తూ ఒక్క శాఖ కూడా ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ పనితీరుకు, ఇప్పడు ఆ శాఖ పనితీరుకు తేడా చూడాలని కోరారు. ‘ఏదైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా? టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించలేదా? పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా? గతంలో జరిగినట్టుగా ఏమైనా లోపాలు జరిగాయా?’ అని ప్రశ్నించారు.
హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా కరెంటు పోయింది. సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, మేయర్ సుధారాణితో కలిసి ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఇంతలోనే కరెంట్ పోవడంతో చీకటి అలుముకుంది.