Indian Army | న్యూఢిల్లీ: దేశ మిలిటరీ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు క్లాస్మేట్స్ ఆర్మీ, నేవీ అధిపతులు అయ్యారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి 1970లో మధ్యప్రదేశ్లోని రేవాలో గల సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. రక్షణ శాఖ మంత్రి అధికార ప్రతినిధి భరత్ భూషణ్ ఈ విషయాన్ని ఎక్స్లో షేర్ చేశారు.
‘50 ఏండ్ల తర్వాత తాము పనిచేసే సర్వీసులను ముందుండి నడిపించే ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను అందించిన అరుదైన గౌరవం రేవా సైనిక్ స్కూల్కు దక్కుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్గా ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.