హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్బీఐ చైర్మన్గా నూతనంగా నియామకమైన చల్లా శ్రీనివాసులశెట్టికి తెలంగాణ తరపున సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాసుల సేవలను కొనియాడారు. గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్ఠాత్మకమైన ఉన్నత పదవి బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.