BRSV | హైదరాబాద్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలి. దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతాం. నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.