KTR | హైదరాబాద్ : కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకైనా.. కేంద్రం జులై 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఎలాంటి కారణాలు చూపకుండా నీట్ పీజీ పరీక్ష వాయిదా వేశారు. వీటన్నింటికీ కారణం నేషనల్ డిజాస్టర్ అలయన్స్(ఎన్డీఏ) అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
జూన్ 4వ తేదీన నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. జూన్ 19న యూజీసీ నెట్ ఎగ్జామ్ను క్యాన్షిల్ చేశారు. జూన్ 21న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ను వాయిదా వేశారు. జూన్ 22న చివరి నిమిషంలో నీట్ పీజీటీ ఎగ్జామ్ను వాయిదా వేశారని కేటీఆర్ పేర్కొన్నారు.
It’s truly an unfortunate turn of events for the students shattering their academic careers
❌ June 4 : NEET-UG paper leak
❌ June 19: UGC-NET cancelled
❌ June 21: CSIR-UGC-NET postponed
❌ June 22: NEET-PGT postponed in the last minute
The BJP-led NDA government’s…
— KTR (@KTRBRS) June 24, 2024