KTR | హైదరాబాద్ : సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మరో నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుందని ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లు, ఏజెన్సీలు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయలాంటిదని గతంలోనే కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు చెప్పినట్లుగానే ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. సీతారామ పనులు కేసీఆర్ హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 17 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
Yet another example of the brilliant work done by Team KCR in irrigation sector
Sitarama project will irrigate 10lakh acres at full capacity in Khammam and Kothagudem districts
Big Congratulations to all the engineers, bureaucrats, agencies and public representatives involved… https://t.co/Xsu8k4d1XQ
— KTR (@KTRBRS) June 27, 2024