KTR | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారు. కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను పూర్తిగా తొలగించారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ఆ ప్రముఖ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారు. కానీ ఇది ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తుంది. ఈ వెబ్సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడం, కొన్ని వెబ్సైట్లు మాయం కావడం వెనుకాల పాలకుల హస్తం ఉండొచ్చు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ సీఎంగా పరిపాలన కొనసాగించారు. కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తొలగించేశారు అని కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమైన కంటెంట్ను ఆర్కైవ్స్లో భద్రపరచాలి. కానీ ఇలా తొలగించడం సరికాదు. ఈ విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భావి తరాలు క్షమించవు. కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించి, ఈ విలువైన సమాచారాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. ఏయే వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు తొలగించారు అనే వివరాలను త్వరలోనే మీకు పంపిస్తాను. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Smt Santhi Kumari Garu,@TelanganaCS
I request your urgent intervention regarding digital vandalism of Telangana Govt websites & social media handles
➡️ After the Congress party formed the government in December 2023, vital content on Telangana Government websites and social… pic.twitter.com/ufaKaB9J7h
— KTR (@KTRBRS) July 2, 2024