KTR | హైదరాబాద్ : దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీవీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. హస్తినలో ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మొదటి దక్షిణ భారత నాయకులు పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేసిన ప్రధాని మన పీవీ అని ప్రశంసించారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపిన వ్యక్తి మన పీవీ. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావును దేశం ఎన్నటికీ మరిచిపోదు. భూసంస్కరణల్లో భాగంగా 8 వందల ఎకరాల భూమిని సర్కార్కు అప్పగించిన గొప్ప నాయకుడు పీవీ. విద్యాసంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడు పీవీ. పీవీ నరసింహారావుకు భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. భారతదేశాన్ని ప్రపంచపటంలో ఉన్నతంగా నిలిపారు పీవీ. నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు నామకరణం చేశాం. అక్కడే ఆయన విగ్రహం ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు.
LIVE:PV Narsimha Rao Birth Anniversary Celebrations in Telangana Bhavan@KTRBRS https://t.co/xm7UI4Wxw3
— BRS Party (@BRSparty) June 28, 2024