హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ణయాలపై ఎటువంటి కమిషన్లు ఏర్పాటు చేయకూడదనే ఇంగితం మరిచి కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం అజ్ఞానమో, అధర్మమో సీఎం రేవంత్రెడ్డికే తెలియాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోలు అంశంపై వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిటీ విచారణ ఏకపక్షంగా, కక్షసాధింపు కమిషన్గా రూపాంతరం చెందిందని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో జస్టిస్ నర్సింహారెడ్డి భార్య ఇందిర ఉస్మానియా యూనివర్సిటీలో 2020 కొవిడ్ కాలంలో 311 చదరపు గజాల భూమిని ఆక్రమించే ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని పేర్కొన్నారు.