KCR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు కృషి చేశారు. ఆ ఫలితాలను తెలంగాణ ప్రజలందరూ కళ్లారా చూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. దీంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల నెరవేరింది.
సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమైంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 17 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. గంగమ్మ జల సవ్వడులతో ఖమ్మం నేల తడిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందనుంది. పంపుల నుంచి ఎగిసిపడ్డ జలాలను చూసి ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయలాంటిదని గతంలోనే కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు చెప్పినట్లుగానే ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. సీతారామ పనులు కేసీఆర్ హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి.
నెరవేరిన తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ గారి కల.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్
ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమవుతున్న తరుణం.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు… pic.twitter.com/vb8hUUy6qd
— BRS Party (@BRSparty) June 27, 2024