హైదరాబాద్, జూలై 4 (నమస్తే తె లంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తో తనకు సంబంధం లేదని, తనపై దు ష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే నవీన్కుమార్ తెలిపారు. ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రణీత్రావు, శ్రవణ్రావు తో తనకు కనీస పరిచయాలు కూడా లేవని, తాను ఏనాడు వారితో ఫోన్లో మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఫంక్షన్లలోనో, ఇం కెక్కడో మర్యాదపూర్వకంగా మాట్లాడి ఉంటా నే తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కొందరు తన పేరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.