RS Praveen Kumar | ప్రజాప్రభుత్వమని చెబుతున్న తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఎంసెట్, నీట్ పాస్ కావాలనే నిబంధనను తీసుకువచ్చారని.. దీన్ని సడలించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఇంటర్మీయట్ బైపీసీ గ్రూప్లో పాసైన విద్యార్థులకు నేరుగా బీఎస్పీ నర్సింగ్ అడ్మిషన్కు అవకాశం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ, రేవంత్రెడ్డి సర్కారులో నిబంధనలు అడ్డగోలు నిబంధనలు పెట్టారన్నారు. ఈ నిబంధనను సడలించాలని.. ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నర్సింగ్లో అడ్మిషన్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే వేలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించారు.