Manne Krishank | హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ టిక్కెటింగ్ మెషీన్ల కాంట్రాక్ట్పై తాము వివరణ ఇవ్వలేం.. అది మా పరిధిలో లేదంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ వేసిన ఆర్టీఐకి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు.
రెండు సంవత్సరాల నుంచి రద్దు చేస్తూ వచ్చిన కాంట్రాక్టు మూడు రోజుల్లో ఎలా ఇచ్చారు..? అని క్రిశాంక్ ప్రశ్నించారు. టెండర్ లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు. మూడు రోజుల్లో ఆర్టీసీ డెలిగేషన్ దేశం మొత్తం వెళ్లి స్టడీ చేసిందా? అని అడిగారు. ఏయే రాష్ట్రాలకు వెళ్లారు. ఏ అధికారులను కలిశారు. వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇచ్చారు అని ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఆర్టీసీ అధికారుల సింపుల్ గా ఆర్టీసీ టిక్కెటింగ్ మెషీన్ల కాంట్రాక్టు పై మేం వివరణ ఇవ్వలేము, అది మా పరిధిలో లేదు అన్నారని క్రిశాంక్ తెలిపారు.
రాష్ట్రంలో అధికారులను ఏదైనా సమాచారం అడిగితే మాకు తెలియదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు… మంత్రులను ఏదైనా అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు అంటూన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు.. కేవలం డమ్మీలుగా ఉన్నారా..? వారి నిర్ణయాలు డమ్మీగా ఉన్నాయా..? అధికారులు మంత్రులకు చెప్పడం లేదా..? లేదా తప్పించుకునేందుకు మంత్రులే సాకులు చెబుతున్నారా..? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని మన్నె క్రిశాంక్ నిలదీశారు.