Manne Krishank | హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో చేతులు కలిపితే బీఆర్ఎస్కు లక్షల సంఖ్యలో ఓట్లు ఎలా వస్తాయని రేవంత్ను క్రిశాంక్ నిలదీశారు. అబద్దాల ప్రచారం ఆపేసి ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలని రేవంత్కు క్రిశాంక్ సూచించారు.
మహబూబాబాద్లో బీఆర్ఎస్కు 2.61 లక్షల ఓట్లు, బీజేపీకి 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీతో చేతులు కలిపామా..? వరంగల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి 2.20 లక్షల మోజార్టీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 2.32 లక్షల ఓట్లు పోలయ్యాయి. మరి మేం బీజేపీతో చేతులు కలిపితే కాంగ్రెస్ ఎలా గెలిచింది..? భువనగిరి నియోజకవర్గంలో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి 2.20 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్కు 2.54 లక్షల ఓట్లు వచ్చాయి. మేం బీజేపీతో చేతులు కలిపితే కాంగ్రెస్ ఎలా గెలిచేది..? నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కేవలం 94 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బీజేపీపై గెలుపొందింది. బీఆర్ఎస్కు 3.19 లక్షల ఓట్లు వచ్చాయి.. బీజేపీ కంటే కేవలం 40 వేల ఓట్లు తక్కువ. నాగర్కర్నూల్లో మేం గట్టి పోటీ ఇవ్వకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయేవారు కదా..? అని రేవంత్ను క్రిశాంక్ ప్రశ్నించారు.
దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాయి. ప్రాంతీయ పార్టీలు ఎంత అవసరమో ఆయా రాష్ట్రాల్లో నిరూపించారు. మోదీ, రాహుల్ గ్యారెంటీలు ప్రజలకు చేరేవరకు పోరాడుతాం. కాంగ్రెస్, బీజేపీ అబద్దాలకు తల వంచే ప్రసక్తే లేదు.. ప్రజల తరపున కొట్లాడుతాం అని క్రిశాంక్ పేర్కొన్నారు.
Shri @revanth_anumula ,
Elections are done, should’nt you stop lying & focus on governance…
➡️Mahabubabad –
BRS got 2 lakh 61thousand votes , BJP got 1.08 lakh only..
Did we join hands with BJP ❓️
➡️Warangal –
Congress Majority on BJP is 2.20lakh.
BRS got 2.32 lakh,
if we…— Krishank (@Krishank_BRS) June 5, 2024