BRS Vinod Kumar | జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త న్యాయ చట్టాలను నరేంద్రమోదీ సర్కార్ వెనక్కు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని 348 ఆర్టికల్ ప్రకారం కొత్త చట్టాలు ఇంగ్లిష్ లోనే అమలు చేయాలని ఉందని గుర్తు చేశారు. దానికి భిన్నంగా కొత్త చట్టాల పేర్లు హిందీలో పెట్టారని ఆరోపించారు. బలవంతంగా అన్ని రాష్ట్రాలపై హిందీ సంస్కృతిని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చూస్తున్నారన్నారు.
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)ని భారతీయ న్యాయ సన్నిహితగా మార్చారని వినోద్ కుమార్ అన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత మార్చిన కేంద్రం.. భారతీయ సాక్ష్యాధారాల చట్టా్న్ని భారతీయ సాక్ష అభియాన్ అని పేరు మార్చారని చెప్పారు. దక్షిణ భారత దేశంపై బలవంతంగా హిందీ రుద్దటమేమిటని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ నిలదీశారు.
కొత్త న్యాయ చట్టాల అమలును నిలిపేయాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు ఇందిరా జైసింగ్ రాసిన లేఖపై మూడు వేల మంది మేధావులు సంతకాలు చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. అలా సంతకాలు చేసిన వారిలో మహాత్మాగాంధీ మనుమడు కూడా ఉన్నారని తెలిపారు. గతంలోనే నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని, వాటికి వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమిస్తే ఆ చట్టాలను వెనక్కు తీసుకున్నారని వినోద్ కుమార్ చెప్పారు.
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!