KCR | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లోని స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలోని కంప్రెషర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.