KCR | హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. దామోదర్ రావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆండాళమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
ఆండాళమ్మ మాతృమూర్తి పార్థివదేహానికి ఎమ్మెల్యేలు హరీశ్రావు, సంజయ్ కుమార్, కేటీఆర్, ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. దామోదర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి అండాళమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కె. చంద్ర శేఖర్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దివంగత అండాళమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
— BRS Party (@BRSparty) March 2, 2024