గద్వాల, జూన్ 3: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లొంగలేద ని, నీతి, నిజాయితీకి కేరాఫ్గా వారు ఉన్నారని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ, బీఆర్ఎస్ జెండాలను ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఎగురవేశారు. నడిగడ్డ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల చెప్పారు. తన విజయానికి కృషి చేసిన అందరికీ ఎమ్మెల్సీ నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.