హైదరాబాద్ : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్(MLA Sanjay Kumar) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు(BRS activists) భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని విధాల లబ్ధిపొంది ఎమ్మెల్యేగా గెలిచాక వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంజయ్ దిష్టిబొమ్మలను(Burnt effigies) తగులబెట్టారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నిరసనగా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి ఎలాంటి సమాచారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్పించుకోవడం సరికాదని తెలిపారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ సాధారణ కార్యకర్తగానే కొనసాగుతానని ఒక ప్రకటనలో తెలిపారు. మరోవవైపు సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆగ్రహంగా ఉన్నారు.