భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఈ సమయంలో స్వామి వారి ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలివేయనున్నారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచారు.
రాములవారి దర్శన వేళలు