Teenmar Mallanna | యాదాద్రి భువనగిరి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు విద్యార్థి సంఘాలు.. కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరుగుతున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ తగిలింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చిన తీన్మార్ మల్లన్నను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించాలని మల్లన్నను డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఉద్యోగుల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తానని మల్లన్న హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ మల్లన్నను బీజేవైఎం నేతలు లెక్క చేయలేదు. తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ
నిరుద్యోగులకు మరియు టీచర్స్ ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని దీనిపై పట్టభద్రుల ఎమ్మెల్సీ స్పందించాలని జిల్లా పరిషత్ మీటింగ్ ముట్టడి. pic.twitter.com/KJQTfnIH5f
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024