హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీకే అవకాశమివ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పదవితోపాటు త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయాలని కోరారు. ఈ మేరకు రాహుల్గాంధీకి సోమవారం లేఖ రాశారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్వద్ద ఆ లేఖలోని అంశాలను విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓసీకి ముఖ్యమంత్రి పదవి, ఎస్సీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన నేపథ్యంలో బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవినివ్వాలని డిమాండ్ చేశారు.
ఔత్సాహిక బీసీ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఉన్నతవర్గాలతో సమానంగా ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు, అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలకవర్గాలను ఏర్పాటు చేయడంపాటు చేతివృత్తుల సహకార సంఘాలకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని, ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని కోరారు. 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నిబద్ధుడనై, అధిష్టానానికి, ముఖ్యమంత్రికి విధేయుడుగా ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ వరింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడనీ, తన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.