Basti Davakhana | జూబ్లీహిల్స్/హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని బస్తీ దవాఖానల్లోని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 1న జీతాలు ఇవ్వకపోతే 2 నుంచి సేవలను బంద్ చేస్తామని హెచ్చరించారు.
గురువారం వీరంతా కాంట్రాక్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ముందు నిరసన తెలిపారు. సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా చాకిరీ చేయించుకోవడం సమంజసంకాదని పేర్కొన్నారు. కొంతమంది ప్రతినిధులను మంత్రి దామోదర రాజనర్సింహ పిలిచి చర్చలు జరిపి, మూడు రోజుల్లో వేతనాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.
ఏపీ ఉద్యోగులకు ఐదురోజుల పనిదినాలు
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : సెక్రటేరియట్, హెచ్వోడీలో పని చేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరభ్కుమార్ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్కు వచ్చి పోయేందుకు వీలుగా వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వైసీపీ సరార్ ఈ విధానాన్ని కొనసాగించింది.
రొమ్ము క్యాన్సర్కు నానో డ్రగ్ డెలివరీ వ్యవస్థ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రొమ్ము క్యాన్సర్పై సమర్థంగా పనిచేసే అధునాతన చికిత్సను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిటల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ‘నానో స్కేల్ డ్రగ్ డెలివరీ సిస్టం’ ద్వారా క్యాన్సర్ కణాలను అంతమొందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ ఏజెంట్లు క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసి, బయటి నుంచి రోగ నిరోధక శక్తి అందించేలా ప్రత్యేక చికిత్స విధానాన్ని రూపొందిస్తున్నారు. డ్రగ్ డెలివరీ సిస్టంతో క్యాన్సర్ కణాల వృద్ధి తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విధానంతో అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చన్నారు.