Barrelakka : టీజీఎస్పీఎస్సీ (TGSPSC) కార్యాలయం దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా ‘సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ ఆమె నినదించారు.
కాగా, గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటింపు, జాబ్ క్యాలెండర్ విడుదల, జీవో 46 రద్దు లాంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే నిరుద్యోగల మార్చ్ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. జిల్లాల నుంచి యువత రాజధానికి రాకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నది.
హైదరాబాద్ చుట్టూ పికెటింగ్లు ఏర్పాటు చేసింది. జిల్లాల నుంచి వస్తున్న ప్రతివాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే బర్రెలక్క టీటీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగగా పోలీసులు అరెస్ట్ చేశారు.
TGSPSC వద్ద ఆందోళన చేస్తున్న బర్రెలక్కను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/QMqD417lO4
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024