నాంపల్లి కోర్టులు, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు చుక్కెదురైంది. వారి తరఫున దాఖలైన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య గురువారం డిస్మిస్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో ఉన్న రాధాకిషన్రావుకు 90రోజులు పూర్తికానందున డిఫాల్ట్ బెయిల్కు దరఖాస్తు చేసుకోలేదు.
అమెరికాలో చికిత్స చేయించుకుంటున్న ప్రభాకర్రావు, శ్రావణ్కుమార్పై కొనసాగుతున్న వారెంట్పై అధికారులు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాకర్రావు విజిటింగ్ పాస్పోర్టు గడువు బుధవారం పూర్తికావడంతో చర్యలపై సమాలోచన చేస్తున్నారు.