ముప్కాల్, జూలై 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP) ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను(Babli gates opened )సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల(Supreme Court orders) మేరకు గేట్లను లేపారు. తెలంగాణ, మహారాష్ట్రతో పాటు సీడబ్ల్యూసీ ప్రతినిధుల సమక్షంలో14 గేట్లను తెరిచారు. బాబ్లీలో ఉన్న 0.2 టీఎంసీల నీరు దిగువకు వస్తున్నదని ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ శ్రీనివాస్గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్త, సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ ఈఈ చక్రపాణి, ఏఈఈ బన్సద్, ఏఈఈ వంశీ, సతీష్ ఉన్నారు.