హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా అతుల్జైన్ను నియమిస్తూ కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ ఆదివారంతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో అతుల్జైన్ను చైర్మన్గా కేంద్రం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2నెలలు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై విచారణ చేసి 100రోజుల్లో నివేదికను అందజేయాలని నిర్దేశిస్తూ మార్చి14న ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. మరోసారి గడువును పొడిగించింది. ఆగస్టు 31వ తేదీలోగా విచారణ నివేదికను అందజేయాలని కమిషన్కు సూచించింది. జస్టిస్ పీసీ ఘోష్ జూలై 5న రాష్ర్టానికి వచ్చి విచారణను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, జూన్29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మ ధ్య కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ విచారణ పడింది. ఏపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ ఈ మేరకు నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విచారణలో భాగంగా ఎస్వోసీలపై కౌంటర్ అఫిడవిట్, స్టేట్మెంట్లను జూ న్ 11లోగా దాఖలు చేయాలని ఇరు రాష్ర్టాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ విచారణను జూలై 15, 16వ తేదీలకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్ వాయిదా వేశారు. కాగా ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్టు ట్రిబ్యునల్ తెలిపింది. తదుపరి విచారణ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపింది.