KRMB | కృష్ణా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్గా అతుల్ జైన్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో అతుల్ జైన్ను చైర్మన్గా కేంద్రం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు పశ్చిమ బెంగాల్కు చెందిన విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై విచారణ చేసి వందరోజుల్లో నివేదికను అందజేయాలని నిర్దేశిస్తూ మార్చి14న ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.
మార్గదర్శకాలను జారీ చేసింది. నిర్దేశిత గడువు ఇటీవలనే ముగిసిపోయింది. మరోవైపు విచారణ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం పొడగించింది. జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 తేదీలోగా విచారణ నివేదికను అందజేయాలని కమిషన్కు సూచించింది. కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టీస్ పీసీ ఘోష్ 5న తేదీన తిరిగి రాష్ట్రానికి విచారణను ప్రారంభించనున్నారు.