హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ నియమితులయ్యారు. కేంద్రజల్శక్తి శాఖ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేఆర్ఎంబీ ప్రస్తుత చైర్మన్ శివనందన్కుమార్ గురువారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో అశోక్ గోయల్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా అతుల్జైన్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర జల్శక్తిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఇప్పటికే అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న అతుల్జైన్కు పీపీఏ బాధ్యతలను సైతం కేంద్రం అప్పగించింది.