హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): పీజీ మెడికల్ కోర్సుల పునరుద్ధరణ కోసం మహేశ్వర మెడికల్ కాలేజీ దాఖలు చే సిన అప్పీల్ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. కాంగ్రెస్ నేత ఏ లేటి మహేశ్వరరెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తు న్న ఆ కాలేజీ గతంలో నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించడంతో పీజీ కోర్సుల అనుమతిని ఎన్ఎంసీ రద్దు చేసింది. విద్యార్థులను ఇతర ప్రైవేట్ కళాశాలలకు తరలించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం కొట్టివేసింది.