మల్యాల, జూన్ 29: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం దర్శించుకున్నారు. పవన్కు ఆలయ ఈవో ఆకునూరి చంద్రశేఖర్, ఆలయ స్థానాచార్యుడు కపీంద్రస్వామి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ ప్రాకార మండపంలో అధికారులు శేషవస్త్రం తో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ నుంచి నిధులు కేటాయించి 100 గదుల ధర్మశాలను నిర్మించాలని, ఒకేసారి 2వేల మందితో దీక్షవిరమణ చేసేలా మండపం నిర్మించేందుకు చొరవ చూపాలని పవన్కల్యాణ్కు ఈవో వినతిపత్రాన్ని అందజేశారు. కొండగట్టుకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకోగా, రూఫ్టాప్పై నుంచే పవన్ అభివాదం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో మధుసూదన్, ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ రఘచందర్, ఆనంద్సాయి, ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు చంద్రశేఖర్, శ్రీనివాసశర్మ, తహసీల్దార్ ఉన్నారు.