ATR | అమ్రాబాద్, జూన్ 30 : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో పర్యాటక ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సఫారీ యాత్రను ఎన్టీసీఏ సూచనల మేరకు సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు నాగర్కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్గోపిడి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ గేట్ నుంచి వన్యప్రాణులు, ప్రకృతి, వ్యూ పాయింట్ ద్వారా నల్లమల అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన సఫారీ యాత్రను సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ మూడు నెలలు పెద్దపులులు, ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తికి సమయం ఉంటుందని తెలిపారు. వన్యప్రాణులకు వాహనాలు, మనుషుల అలికిడి ద్వారా ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీజీఎంగా ప్రసాద్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఆర్మర్డ్ వెహికల్స్ నిగాన్ లిమిటెడ్కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఓఎఫ్ఎంకే) చీఫ్ జనరల్ మేనేజర్గా ఎస్ఎస్ ప్రసాద్ నియమితులైనట్టు భారత రక్షణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్టు పేర్కొన్నది.