హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ప్రతినిధి బృందం గురువారం కలిసి వినతిప్రతం అందజేసింది.
ఇంధనరంగం, విద్యుత్తు వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్తు సవరణ బిల్లు ప్రతిపాదనను, ప్రైవేటీకరణ, పట్టణ పంపిణీ ఫ్రాంచైజీ ప్రయోగాన్ని ఉపసంహరించుకోవాలని, బొగ్గును తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాల విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఇక్కడ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే, సెక్రటరీ జనరల్ రత్నాకర్రావు, చీఫ్ ప్యాట్రన్ పదమ్జిత్సింగ్ ఉన్నారు.