KTR : టీఎస్పీఎస్సీ చైర్మన్ (TSPSC Chairman) మహేందర్ రెడ్డికి (Mahender Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ (AEE Civil) ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ను నందినగర్లోని ఆయన నివాసంలో ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్లో పెట్టింది. ఇదే విషయాన్ని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. విషయానికి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
ఈ విషయమై కేటీఆర్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు సంబంధించి 1180 పోస్టులకు ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదని పేర్కొన్నారు. అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసి విన్నవించిన పరీక్ష రాసిన అభ్యర్థులు.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన… https://t.co/UjnnRGiUfZ pic.twitter.com/DvOmeLJajr
— BRS Party (@BRSparty) July 3, 2024