హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ): పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ప్రకటన విడుదల చేశారు. పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల కోసం 2022లో నోటిఫికేషన్ జారీ కాగా, 26,548మంది దరఖాస్తు చేసుకోగా, ఆగస్టులో రాత పరీక్ష రాశారు. మెరిట్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 76మంది అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేశారు. తుది జాబితాను వెబ్సైట్లో (https://www.tspsc.gov.in) పొందుపరిచారు.