Telangana | హైదరాబాద్ : కొత్తగా అమలులోకి వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద మేడ్చల్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది.
వైజాగ్కు చెందిన విజయలక్ష్మి.. విశాఖ నుంచి హైదరాబాద్కు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మేడ్చల్ డీటీఎఫ్ ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఫతేనగర్ – బాలానగర్ వెళ్లే మార్గంలో ఫ్లై ఓవర్ల కింద వాహనాల తనిఖీలు నిర్వహించారు.
విజయలక్ష్మి ప్రయాణిస్తున్న బైక్ను పోలీసులు తనిఖీలు చేశారు. ఆమె వద్ద 2.1 కిలోల గంజాయి పట్టుబడింది. ఎన్డీపీఎస్ పరిధిలోకి ఈ కేసు రావడంతో కొత్త చట్టం ప్రకారం వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సిరెడ్డి తెలిపారు. ఈ కేసులో విజయలక్ష్మీతో పాటు రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన సాయి తేజను అరెస్టు చేశారు. మేడ్చల్ ఈఎస్ ఎస్కే ఫజియోద్దీన్, ఏఈఎస్ మాధవయ్య.. ఎస్ఐ పవన్ కుమారెడ్డి, సిబ్బంది చెన్నయ్య, జ్యోతి, వెంకటేశ్వర్ రావును అభినందించారు.