వేములవాడ టౌన్, ఆగస్టు 22 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ(Vemulawada) శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో(Rajanna Temple) అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB )గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. రాజన్న ఆలయంలోని ప్రధాన విభాగాల్లో కొద్ది రోజులుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తూనికలు, కొలతలు, ఆడిట్ శాఖలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు.
పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. గోదాం విభాగంతోపాటు లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న సరకుల శాంపిళ్లను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లా డుతూ.. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు చేశామని తెలిపారు. తనిఖీల నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఈ సోదాల్లో ఏసీబీ సీఐలు కృష్ణకుమార్, తిరుపతి, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.