జనగామ : జనగామ కలెక్టరేట్లో ఓ మహిళా ఆత్మహత్యాయత్ననికి(Woman attempted suicide) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో(Land disputes) ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం( Janagama Collectorate) పైకిక్కి బలవన్మరణానికి(Farmer attempted suicide) ప్రయత్నించాడు. ఆ సంఘటన మరవక ముందే తాజాగా జనగామ జిల్లా నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన వ్యవ సాయ భూ సమస్య విషయమై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిం చింది.
భూ వివాదంలో జ్యోతి గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా, పట్టించుకోవడంలేదని మనస్థాపం చెంది సోమవారం కలెక్టరేట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే అప్పటికే ఇంటివద్ద నిద్ర మాత్రలు మింగి ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి జ్యోతి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.