హైదరాబాద్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి యత్నించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కామాంధుడి కంబంధ హస్తాల నుంచి తన పిల్లలను రక్షించుకునేందుకు అగ్నిసాక్షిగా కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు నిర్ణయించు కుంది. భర్తను గొడ్డలితో( Axe) నరికి చంపి(Murder) పిల్లలను కాపాడుకున్నది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తల్లి, కుమార్తె పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వివరాల్లోకి వెళ్లే.. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మాణయ్య, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి పెద్ద కూతురు భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులకు వెళ్తున్నది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో మాణయ్య కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహానికి లోనైన ఇందిర భర్తను గొడ్డలితో నరికి చంపింది. కాగా, ఇంట్లో కొనసాగుతున్న గొడవల నేపథ్యంలో కొద్ది సంవత్సరాల క్రితం వారి కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.