MBBS Seats | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా.. అక్షరాలా లక్షకుపైనే. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరగటంతో క్రమంగా డాక్టర్ల కార్ఖానాగా తయారవుతున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్ సభకు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 1,08,940 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
2014తో పోల్చితే మెడికల్ కాలేజీల సంఖ్య 82 శాతం పెరిగింది. పదేండ్ల కింద 387 కాలేజీలు మాత్రమే ఉండేవి. 51,348 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 112 శాతం పెరిగింది. పీజీ సీట్లు 31,185 నుంచి 70,674కు పెరిగాయి. 127 శాతం పెరుగుదల నమోదైంది.