భద్రాచలం, జూలై 3: భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన రియాన్షిక (4)కు సోమవారం ప్రమాదవశాత్తు తలలో పెన్ను గుచ్చుకున్నది. ఖ మ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొ ందుతున్న చిన్నారి బుధవారం మృతిచెందిం ది.
యూకేజీ చదువుతున్న రియాన్షిక మం చంపై కూర్చొని నోట్స్ రాస్తూ ప్రమాదవశాత్తు కిందపడగా ఎడమ చెవి అగ్రభాగంలో తలలోకి పెన్ను దిగింది. రక్తస్రా వం కావడంతో తల్లిదండ్రు లు చిన్నారిని ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. పాపను పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్నును తొలగించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందింది.